బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.
నిరసన నేపథ్యంలో మాట్లాడిన ఎర్ర సత్యనారాయణ, బడ్జెట్లో బీసీలకు తగిన కేటాయింపులు చేయాలని, బీసీ సబ్ ప్లాన్పై ప్రభుత్వం తక్షణ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు ఏకమై నిర్వహించిన ఈ నిరసన అద్భుత విజయమని, ఇది బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతమని ఆయన పేర్కొన్నారు.
ఆకస్మిక ముట్టడి కారణంగా సుమారు 30 నిమిషాల పాటు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. అన్ని వైపులా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 300 మంది పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను ఎన్టీఆర్ గార్డెన్ వైపు మళ్లించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారులు, ప్రెస్ మరియు సోషల్ మీడియా ప్రతినిధుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది.
పరిస్థితి అనంతరం ట్రాఫిక్ను పోలీసులు క్రమంగా సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ఘటనపై ప్రభుత్వం స్పందన కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
"అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్"గౌరీ జాతీయులకు ప్రకటన ఆహ్వానం🙏
"అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్"గౌరీ జాతీయులకు ప్రకటన ఆహ్వానం🙏ఈ ట్రస్ట్" కేంద్ర కమిటీ "ఎన్నికలు 08 మార్చి 2026 ఆదివారం ఉదయం 10 గంటలనుండి, డోర్ నెంబర్ 57-1-43,గోకుల్నగర్, కంచరపాలెం, విశాఖపట్నం - 530008,పై ట్రస్ట్ హెడ్ ఆఫీస్లో ఎన్నికలు జరుగును.కేంద్ర కమిటీ అనగా, ప్రపంచ వ్యాప్తంగా వున్న గవర జ......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......