యువకుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి -కుటుంబానికి న్యాయం చేయాలి: జూపూడి శ్రీనివాసరావు
యువకుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి: జూపూడి శ్రీనివాసరావు
గుంటూరు, జనవరి 19, 2026:
యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత యువకుడికి మరియు అతని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవా సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా చెర్లోపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల చీమలదిన్నె మహర్షిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మహర్షిని దాడికి గల కారణాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జూపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ బడుగు, బలహీన వర్గాలపై అగ్రకులాల దాడులు కొనసాగుతుండటం దురదృష్టకరం అని తీవ్రంగా మండిపడ్డారు.
చిన్నపాటి ప్రమాదాన్ని కారణంగా చూపి, బట్లకోడూరు గ్రామానికి చెందిన అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు రజక కులానికి చెందిన ఆటో డ్రైవర్ చీమలదిన్నె మహర్షిని చెట్టుకు కట్టేసి, రెండు గంటల పాటు విడతలవారీగా ముఖంపై, శరీరంపై తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై బాధితుడు పామూరు మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల బాధిత కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతోందని తెలిపారు.
తక్షణమే మహర్షికి న్యాయం చేయడంతో పాటు, బాధిత కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా రజక కుల సంఘాల నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......