;

గవర జాతీయుల పేద విద్యార్థులకు కొనసాగుతున్న ఆర్థిక సహాయం

news

గవర జాతీయుల పేద విద్యార్థులకు కొనసాగుతున్న ఆర్థిక సహాయం

అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 మందికి రూ.1000 చొప్పున పంపిణీ

రాజమండ్రి, జనవరి 12:

అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ నేతృత్వంలో గవర జాతీయుల పేద విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతినెల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం గవర జాతీయులందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 60 మంది విద్యార్థులకు (50 + 10 మంది) ప్రతినెల రూ.1000/- చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతోంది.

సాధారణంగా ప్రతి నెల 11వ తేదీన ఈ ఆర్థిక సహాయం విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతుంటుంది. అయితే 2026 జనవరి 11వ తేదీ ఆదివారం కావడంతో, ఈ నెలలో జనవరి 12వ తేదీ (నేడు) విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1000/- చొప్పున జమ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు.

ఈ నెలతో వరుసగా ఏడవ నెల కూడా నిరంతరంగా ఈ సహాయం అందించడం జరిగిందని తెలిపారు. విద్యాభివృద్ధే లక్ష్యంగా గవర జాతీయుల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ట్రస్ట్ నాయకత్వం పేర్కొంది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ ఆడారి ఉమా శంకరరావు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

– ఆడారి ఉమా శంకరరావు

(ఫౌండర్ & చైర్మన్)

అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య

సెల్: 8328417559

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......