;

ఇంకొల్లులో ఘనంగా రేనాటి బిడ్డ వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు

news

ఘనంగా రేనాటి బిడ్డ వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు

ఇంకొల్లులో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న పర్చూరు నియోజకవర్గ బీసీ అధ్యక్షులు గుంజి అనిల్ కుమార్

ఇంకొల్లు:

స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి బిడ్డ వడ్డె ఓబన్న 219వ జయంతి సందర్భంగా ఆదివారం ఇంకొల్లు గ్రామంలోని పర్చూరు రోడ్ అంకమ్మ కాలనీలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్చూరు నియోజకవర్గ బీసీ అధ్యక్షులు గుంజి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా గుంజి అనిల్ కుమార్ మాట్లాడుతూ, వడ్డె ఓబన్న స్వాతంత్ర్య పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా, సైన్యాధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలకులకు వడ్డె ఓబన్న ముప్పుతిప్పలు పెట్టినట్లు చరిత్రలో స్పష్టమైన ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.

అనంతరం ఇంకొల్లు గ్రామంలోని రామకృష్ణ థియేటర్ వెనుక ఉన్న వడ్డెర కాలనీలో నివాసం ఉంటున్న గుంజి రాంబాబు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఒక కాలు తొలగించుకున్న విషయం తెలుసుకున్న గుంజి అనిల్ కుమార్, సబ్‌ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. సురేష్, గుంజి వెంకటేశ్వర్లు కలిసి ఆయనను పరామర్శించారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకొని, వారి కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేశారు.

ఈ సందర్భంగా గుంజి అనిల్ కుమార్ మాట్లాడుతూ, గుంజి రాంబాబుకు ప్రభుత్వ పింఛను మంజూరు అయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......