కోవూరు మండలం డీసీఎఫ్ అథరైజ్డ్ కోఆర్డినేటర్గా షేక్ అబ్దుల్ గఫూర్ నియామకం
కోవూరు మండలం డీసీఎఫ్ అథరైజ్డ్ కోఆర్డినేటర్గా షేక్ అబ్దుల్ గఫూర్ నియామకం
కోవూరు మండల దూదేకుల కేర్ ఫోర్స్ (DCF) అథరైజ్డ్ కోఆర్డినేటర్గా అబ్దుల్ గఫూర్ ను నియమించారు. ఈ నియామకానికి సంబంధించిన నియామకపత్రాన్ని డీసీఎఫ్ ఫౌండర్ హన్ను భాయ్, స్టేట్ ఆర్గనైజర్ షేక్ అల్తాఫ్, జిల్లా ఆర్గనైజర్లు షేక్ మస్తాన్, హాజరత్ అలీ ఆధ్వర్యంలో అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, అబ్దుల్ గఫూర్ కు సామాజిక సేవా రంగంలో అనుభవం ఉందని, డీసీఎఫ్ లక్ష్యాలు, ఆశయాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కోవూరు మండలంలో సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు దూదేకుల సామాజికవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన అబ్దుల్ గఫూర్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, డీసీఎఫ్ ఫౌండర్ హన్ను భాయ్ నాయకత్వంలో సంస్థ అభివృద్ధికి, మండల స్థాయిలో దూదేకుల ప్రజలకు సేవ చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీఎఫ్ కోఆర్డినేటర్స్, షేక్ మల్లి బాబు, షేక్ నజీర్, షేక్ రహంతుల్లా, షేక్ ఖాదర్ మస్తాన్, మరియు సభ్యులు పాల్గొని నూతన కోఆర్డినేటర్కు శుభాకాంక్షలు తెలిపారు.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......