;

“బీసీ బంధు” కేసన శంకరరావుకు స్వగ్రామంలో ఘన సత్కారం

news

“బీసీ బంధు” కేసన శంకరరావుకు స్వగ్రామంలో ఘన సత్కారం

రేపల్లె నియోజకవర్గం | నిజాంపట్నం మండలం | బొర్రావారిపాలెం

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అహీర్ అవార్డు గ్రహీత “బీసీ బంధు” కేసన శంకరరావుకు వారి స్వగ్రామమైన బొర్రావారిపాలెంలో ఘన సన్మానం జరిగింది. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గ్రామ ప్రజలు, బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పేదలు–బడుగుల ఆరాధ్య నాయకుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

గజమాలలు, బొకేలు, శాలువాలతో కేసన శంకరరావును ఆత్మీయతానురాగాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ—అణగారిన వర్గాల హక్కుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసన శంకరరావు నేతృత్వంలో నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.

సన్మానానికి ప్రతిస్పందనగా కేసన శంకరరావు మాట్లాడుతూ—దశాబ్దాలుగా సాగిన బీసీ ఉద్యమాల ఫలితంగానే నేడు కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణనకు సిద్ధమవుతోందని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీలు కూడా బీసీ సంక్షేమ సంఘం నిరంతర పోరాటాల ఫలితమేనని పేర్కొన్నారు. వాగ్దానాలు చేయడం సరిపోదని, వాటిని చిత్తశుద్ధితో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర కులగణన నిర్వహించాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం శాసనసభలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచి పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేయించి, షెడ్యూల్–9లో చేర్చడం ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ–చట్టపర రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే బీసీలకు సామాజిక న్యాయం జరిగి, చంద్రబాబు నాయుడు మరియు నరేంద్ర మోడీ చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆకాంక్షించారు.

అలాగే బీసీల రక్షణ చట్టం, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, 50 ఏళ్లకే సామాజిక పెన్షన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని, చట్టసభలలో ఓబీసీ మహిళలకు సబ్–కోటా కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేయాలని సూచించారు. అన్ని రంగాలలో ఓబీసీల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. బీసీల సాధికారితతోనే వికసిత్ ఆంధ్రప్రదేశ్–వికసిత్ భారత్ సాధ్యమని కేసన శంకరరావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకా వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కేసన నాగముత్యాలమ్మ, ఎంపిటిసి బొర్రా బుడారంకమ్మ, రామకృష్ణ, కాగితాల సుబ్బారావు, జుజ్జువరపు సురేష్, చింతల ప్రసాద్, అనగాని హరికృష్ణ, శ్రీనివాసమూర్తి, రాఘవయ్య, ఏడుకొండలు చినబాబు, సాయిబాబు, కూరపాటి రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......