ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అభినందనలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై ప్రత్యేక కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుగా ఉన్న రూ.1200 కోట్ల విడుదలకు ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా, నారా లోకేష్ గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం హృదయపూర్వక అభినందనలు తెలిపింది.
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ— విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ఈ నిర్ణయం ఎంతో ఉపశమనమని పేర్కొన్నారు. బకాయిల విడుదలతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు చదువులో అడ్డంకులు తొలగి, ఉన్నత విద్యకు బలమైన మద్దతు లభిస్తుందని అన్నారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత, విద్యార్థుల ఆశలకు తగినట్లుగా పారిశ్రామిక అవకాశాల ప్రచారం, ఉపాధి సృష్టిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
ఈ కృషిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ గారు చూపుతున్న నాయకత్వానికి కర్రి వేణుమాధవ్ అభినందనలు తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.