బిడ్డల భవిష్యత్ కు శాపంగా మారుతున్న బిసి ఉద్యమాలు ..
బిడ్డల భవిష్యత్ కు శాపంగా మారుతున్న బిసి ఉద్యమాలు ..
బిసి లు అప్రమత్తం కావాలి.
బిసి ల అట్రాసిటీ ముసాయిదా బిల్లు వారి ఆత్మ గౌరవ భవిష్యత్ కు ప్రమాదం
అమరావతి / హైదరాబాద్ :
బిసి ల పిల్లల భవిష్యత్కు తీవ్ర ముప్పుగా మారుతున్న బిసి అట్రాసిటీ ముసాయిదా బిల్లుపై బిసి సమాజమంతా అప్రమత్తం కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
అనాదిగా దళితులపై ప్రయోగించిన ఒక విషపూరిత కుట్రను నేడు అదే తరహాలో బిసి లపై ప్రయోగించేందుకు పాలక వర్గాలు సిద్ధమవుతున్నాయని ఆయన ఆరోపించారు.
బిసి అట్రాసిటీ ముసాయిదా బిల్లు అంటే బిసి లను మరో వందేళ్ల పాటు అంటరాని వారిగా ముద్ర వేయడమేనని స్పష్టం చేశారు.
బిసి లకు అట్రాసిటీ చట్టం ఎందుకు? – కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి
బిసి లు ఎప్పుడూ అంటరాని వారు కాదని, అస్పృశులు కాదని,
బిసి లే అనేక రాజ్యాలను ఏలిన చరిత్ర కలిగిన వర్గాలని మేడా శ్రీనివాస్ గుర్తు చేశారు.
“బిసి లు అంటరాని వారమని మేమెప్పుడు అడిగాం?
బిసి లకు కుల దూషణ చట్టం కావాలని ఎవరు కోరారు?
ఈ ముసాయిదా బిల్లుకు ప్రాతిపదిక ఏమిటో చెప్పే ధైర్యం కూటమి సర్కార్కు ఉందా?”
అని ఆయన ప్రశ్నించారు.
కాపులను బిసి కేటగిరీలో చేర్చాలని జరుగుతున్న ఉద్యమాలపై స్పందించని ప్రభుత్వం,
బిసి లను అస్పృశులుగా ముద్ర వేయే బిల్లును తెచ్చిందని విమర్శించారు.
బిసి లపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాజకీయ – ఆర్థిక రిజర్వేషన్లు ఇవ్వాలి
బిసి లపై చిత్తశుద్ధి ఉంటే
👉 రాజకీయ రిజర్వేషన్లు
👉 సంపద ఆధారిత ఆర్థిక రిజర్వేషన్లు
కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
మనుధర్మం ఆధారంగా రూపొందించిన అబద్దపు చరిత్రను
దళితులు – బిసి లపై అనాదిగా రుద్దుతున్నారని ఆరోపించారు.
అంబేద్కర్ ఆశయాన్ని వక్రీకరిస్తున్న నేటి కుల రాజకీయాలు
డా. బి.ఆర్. అంబేద్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా హక్కుల కోసం పోరాడారని,
కాని నేడు ఆయన పేరును ఉపయోగించి సంపన్న వర్గాలు
దళిత – బిసి ల శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు.
“రిజర్వేషన్ కులానికి కాదు, సంపదకు అని అర్థం చేసుకున్న రోజే
కార్పొరేట్ రాజకీయాలు, కార్పొరేట్ మీడియా కూలిపోతాయి”
అని ఆయన వ్యాఖ్యానించారు.
బిసి అట్రాసిటీ బిల్లు – చాక్లెట్ ఇచ్చి భవిష్యత్ దోచే కుట్ర
ఈ ముసాయిదా బిల్లు
👉 బిసి లను సంపన్నులుగా ఎదగనీయదు
👉 శాశ్వతంగా సంక్షేమ పథకాలపై ఆధారపడేలా చేస్తుంది
👉 రాజకీయ దయా దాక్షిణ్యాలపై జీవించే స్థితికి నెట్టేస్తుంది
ఇది “బ్రతకనీయదు – చావనీయదు” అనే రాజకీయ ఉచ్చు అని హెచ్చరించారు.
కుల ఉద్యమాల వల్ల లాభపడింది ఎవరు? – ఆత్మ విమర్శ అవసరం
ఇప్పటివరకు కుల ఉద్యమాలు, కుల రిజర్వేషన్ల వల్ల
బిసి – దళిత – మైనార్టీలకు నిజంగా ఏమి లాభం జరిగిందో,
భవిష్యత్లో ఏమి కోల్పోతామో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
బహిరంగ చర్చకు సిద్ధం – మేడా శ్రీనివాస్ సవాల్
బిసి అట్రాసిటీ ముసాయిదా బిల్లు రాజ్యాంగబద్ధత,
దాని వెనుక ఉన్న అంతర్గత కుట్రపై
ఏ పాలక మేధావితోనైనా బహిరంగ చర్చకు సిద్ధం అని
మేడా శ్రీనివాస్ సవాల్ విసిరారు.
బిసి ల భవిష్యత్ను కాపాడుకోవాలంటే ఇప్పుడే మేల్కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
– మేడా శ్రీనివాస్
MA, LLM, MA (Journalism), MA (MJMC)
వ్యవస్తాపక అధ్యక్షులు,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
📞 మొబైల్ : 9248777222
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......