డోన్ రైల్వే స్టేషన్లో రైల్వే జీఎంకు ప్రజా సమస్యల వినతిపత్రం
జనవరి 20, 2026:
డోన్ రైల్వే స్టేషన్లో రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిసిన సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, డోన్ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు రైల్వే సమస్యలను వివరించుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ముందు వృద్ధులకు ఉన్న రైల్వే రాయితీలు ప్రస్తుతం నిలిపివేయబడ్డాయని, వాటిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అలాగే, డోన్ రైల్వే స్టేషన్లోని అన్ని ఫ్లాట్ఫారాలపై ఏర్పాటు చేసిన గ్రానైట్ బండలు వర్షం పడిన సమయంలో జారే ప్రమాదం ఉందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాటిని రఫ్గా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
కొన్ని రైల్వే స్టేషన్లలో వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనిపై రైల్వే శాఖ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే, బేతంచర్ల స్టేషన్లో కరోనా ముందు ఆగిన ఎక్స్ప్రెస్ రైళ్లను మళ్లీ ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని, తుంగభద్ర రైలును డోన్ వరకు పొడిగించాలని, నంద్యాల మీదుగా విజయవాడకు వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
డోన్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాల కోసం లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలని, అలాగే వందే భారత్ రైలును డోన్ స్టేషన్లో నిలిపేలా చూడాలని కోరారు. డెమో రైళ్లలో బాత్రూం సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రస్తుతం గుంటూరు వెళ్లే రైలు నాలుగో ఫ్లాట్ఫారం నుంచి బయలుదేరుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఒకటి లేదా రెండు ఫ్లాట్ఫారాల నుంచి బయలుదేరేలా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా, డోన్ ఏఎన్ బంగ్లా బ్యాక్సైడ్ మరియు అమ్మ హోటల్ ఏరియాల్లో రైల్వే స్టేషన్ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
డోన్ పట్టణ ప్రజల తరఫున ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు.
📎 Similar News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......