15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ – రాష్ట్రానికి రూ.1,000 కోట్లు త్వరలో విడుదల!
కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.2,500 కోట్ల పెండింగ్ నిధుల్లో ఈ నెలాఖరులోపు కనీసం రూ.1,000 కోట్లు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సమాచారం అందింది. మిగిలిన మొత్తాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు కూడా కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీ.ఆర్ & ఆర్.డి) నిధుల వినియోగంపై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని జిల్లాలకు మెమో పంపి, నిధుల వినియోగంలో డిజిటల్ విధానం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక బ్యాంకు ఖాతా
15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం కోసం ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ ఖాతాను పీఎఫ్ఎంఎస్ (Public Financial Management System) పోర్టల్లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలి. అలాగే ఈ-గ్రామ్స్వరాజ్ పోర్టల్లో కూడా బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయడం తప్పనిసరి.
డిజిటల్ విధానంలో పారదర్శకత కోసం ఉపసర్పంచ్ను “మేకర్గా”, సర్పంచ్ను “చెకర్గా” నియమించారు. వీరి డిజిటల్ సంతకాలను ఈ-గ్రామ స్వరాజ్ నమోదు చేసి సంబంధిత ఎంపీడీఓల ద్వారా ఆమోదం పొందాలి. ఇందుకు క్లాస్-3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి. సైనింగ్, ఎన్క్రిప్షన్ సౌకర్యాలతో పాటు యూఎస్బీ టోకెన్ ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
డిజిటల్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నిధుల వినియోగం
ఈ మొత్తం డిజిటల్ ప్రక్రియ పూర్తయిన తరువాతే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను జీఈఎం పోర్టల్, ఈ-ప్రోక్యూర్మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా సేకరించాలని పంచాయతీరాజ్ కమిషనర్ శ్రుతి ఓజా ఆదేశించారు.
నిధుల విడుదలతో గ్రామీణాభివృద్ధి పనులకు ఊతం లభించనుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు కీలకంగా మారనున్నాయి.
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్లోని మాతృశ్రీనగర్లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......