;

గ్రామ సభలో కీలక చర్చలు: పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన పథకం & 125 రోజుల ఉపాధి

news

సోమయాజులపల్లె (ఓర్వకల్ మండలం), కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, జనవరి 5:

సోమయాజులపల్లె గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామ సభలో పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన (VB-GRAM) అమలు, సోషల్ ఆడిట్, కొత్త లబ్ధిదారుల చేర్పు–తొలగింపు, అలాగే ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

గ్రామస్తులు, సచివాలయ బృందం మరియు అధికారులు ఒకే వేదికపై సమూహంగా సమావేశమై, పథకం అమలులో పారదర్శకత, లెక్కల సరిచేయడం, పనుల నాణ్యతపై దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా సోషల్ ఆడిట్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆడిట్‌లో లెక్కలు, కూలీల హాజరు, పద్ధతిగల పనుల అమలును పరిశీలించినట్లు తెలిపారు.

గ్రామస్తులు, మహిళలు, యువత ఈ సభలో చర్చించిన అంశాలను సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులను జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్ల తొలగించడం ద్వారా పథకం ప్రయోజనాలు నిజమైన అర్హులకు చేరాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పించాలన్న ప్రతిపాదనను ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని గ్రామ సభలో నిర్ణయించారు.ఈ గ్రామ సభలో చర్చించిన అంశాలు 3 జనవరి న ఎటువంటి వేదికపై కూడా బహిర్గతం కాలేదని స్పష్టం చేశారు. గ్రామస్తుల సమక్షంలోనే చర్చలు జరుగుతున్నాయి మరియు ప్రజల సమ్మతితో తీర్మానాలు నమోదు చేయబడ్డాయి.సమావేశానికి సర్పంచ్ శ్రీమతి జయమ్మ గారు అధ్యక్షత వహించారు. గ్రామ పెద్దలు, మహిళలు తెలుగు లక్ష్మీదేవి గారు, లింగమ్మ గారు, సావిత్రి గారు, రామకృష్ణమ్మ గారు, బీబీ గారు, టి. లక్ష్మీ దేవమ్మ గారు పాల్గొన్నారు.

యువత తరఫున మల్లికార్జున్ (ఆర్థిక శాస్త్రవేత్త), బి. రవికుమార్ గారు, బి. రమణ గారు, ఎం. భాస్కర్ గారు హాజరయ్యారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ రెడ్డి,VB-GRAM టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ నారాయణ, అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తీర్మానాలు:

గ్రామ సభలో చర్చించిన అంశాలు గ్రామ అభివృద్ధి దిశలో సార్వజనిక పారదర్శకత, సమగ్రత మరియు ప్రజల చైతన్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......