;

కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం అత్యవసరం: ఎంఎల్‌ఏ డా. చదలవాడ అరవిందబాబు

news

కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం అత్యవసరం: ఎంఎల్‌ఏ డా. చదలవాడ అరవిందబాబు

ఓబీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 15–16 తేదీల్లో ‘ఛలో ఢిల్లీ’ని జయప్రదం చేయాలని బీసీలకు పిలుపు

పల్నాడు జిల్లా, నరసరావుపేట:

బీసీల రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ తక్షణం ఏర్పాటు చేయాల్సిన అత్యవసరం ఉందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు.

అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న ఓబీసీ ల ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన బీసీ వర్గాలన్నింటికీ పిలుపునిచ్చారు.

మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ‘ఛలో ఢిల్లీ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

34% స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం పోరాటం

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని, అందుకోసం పార్లమెంట్‌లో సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే అరవిందబాబు డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్‌తో పాటు ఓబీసీల సర్వతోముఖ అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమని, ఇది దేశవ్యాప్తంగా కోట్లాది బీసీలకు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు.

ఎన్‌టిఆర్, చంద్రబాబు బీసీల కోసం చేసిన కృషి

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన—

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేయాలని ఎన్టీఆర్ అత్యంత కృషి చేశారని,

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వమే బీసీలకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు.

తాజాగా బీసీల సామాజిక భద్రత కోసం సామాజిక రక్షణ చట్టం అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ఓబీసీ ల వృత్తి ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యం

కులవృత్తుల ఆధారంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయగల విధంగా బీసీ చేతివృత్తులకు ప్రభుత్వం మరిన్ని అవకాశాలు, ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

ఛలో ఢిల్లీ: భారీ స్థాయిలో పాల్గొనాలని పిలుప

అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో:

15న ఢిల్లీ – జాతీయ ఓబీసీ సెమినార్

16న ఢిల్లీ జంతర్ మంతర్ – ఓబీసీ మహా ధర్నా

ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యంగా ఆర్. కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు, పాకా సత్యనారాయణ తదితరులు పాల్గొననున్నట్లు వరప్రసాద్ తెలిపారు.

బీసీ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:

టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మానుకొండ శివప్రసాద్

మాజీ ఉడా డైరెక్టర్ రాజపుత్ర సత్యం సింగ్

ఓబీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నాయకులు రావూరి కోటేశ్వరరావు, బోయన బత్తుల వెంకటేష్, కొణిదే గోపికృష్ణ, భట్టు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......