;

ఐఏఎస్, ఐపీఎస్‌లపై జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ద్రావిడ దేశం కృష్ణారావు ఒంగోలు,

news

ఐఏఎస్, ఐపీఎస్‌లపై జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ద్రావిడ దేశం కృష్ణారావు

ఒంగోలు,

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానకరంగా సంబోధించిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ద్రావిడ దేశం అధ్యక్షులు వి. కృష్ణారావు తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

బీసీ వర్గాలకు చెందిన అగ్రశ్రేణి అధికారులను ‘వాడు, వీడూ’ వంటి తక్కువ చేసి మాట్లాడటం బీసీ సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. బీసీ కుటుంబంలో జన్మించి, ప్రతిభతో ఐఏఎస్ అవతారమెత్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక కీలక రంగాల్లో నిర్దోష సేవలు అందించిన పి. కృష్ణయ్య బీసీ వర్గాలకు గర్వకారణమని కృష్ణారావు గుర్తుచేశారు. చిన్నపాటి మచ్చ కూడా లేని వారి సేవలను నిర్లక్ష్యం చేయడం లేదా అవమానించడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదన్నారు.

అలాగే మరో ప్రతిష్టాత్మక అధికారి గోపీనాథ్ జెట్టి పై కూడా జగన్ చేసిన వ్యాఖ్యలను బీసీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ అహంకారానికి నిదర్శనమని, వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

"జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే, వాటి ప్రభావం రాజకీయంగా వారి పార్టీకే నష్టాన్ని తేచ్చే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి" అని ద్రావిడ దేశం అధ్యక్షులు వి. కృష్ణారావు హెచ్చరించారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......