ఎపిలో బిసి ఉద్యమానికి నాంది - డిసెంబర్ 11న విజయవాడలో ఏపీ బీసీ మహా సదస్సు
ఎపిలో బిసి ఉద్యమానికి నాంది
- డిసెంబర్ 11న విజయవాడలో "ఏపీ బీసీ మహా సదస్సు"
- భారత చైతన్య యువజన పార్టీ, ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు
- రాజధానిలో వెయ్యి ఎకరాలు, 44 శాతం రిజర్వేషన్లు, బిసి రక్షణ చట్టం, రాజధాని నిర్మాణంలో బీసీల పాత్ర ప్రధాన ఎజెండాగా సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీ వర్గాల హక్కుల సాధన, రాజకీయ సాధికారత లక్ష్యంగా ఒక చారిత్రాత్మక "ఏపీ బీసీ సదస్సు"ను నిర్వహిస్తున్నట్లు భారత చైతన్య యువజన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ మీడియా సంస్థ ఎన్టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ఈ సదస్సు ఒక బలమైన వేదిక కానుందని పార్టీ పేర్కొంది.
ఈ సదస్సులో ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు బిసివై పార్టీ ఆ పత్రికాప్రకటన లో తెలిపింది.
సదస్సు ముఖ్య ఎజెండా:
1. రాజధానిలో బీసీ ఆత్మగౌరవం: నూతన రాజధానిలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం తక్షణమే 1000 ఎకరాల భూమి కేటాయించాలి
2.రాజకీయ సాధికారత: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం 44% రిజర్వేషన్లను చట్టబద్ధంగా పునరుద్ధరించాలి
3.చట్టబద్ధమైన రక్షణ: బీసీలపై జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ దాడులను అరికట్టేందుకు పటిష్టమైన "బీసీ రక్షణ చట్టాన్ని" వెంటనే అమలులోకి తీసుకురావాలి
4.రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రణాళికలో, అభివృద్ధిలో బీసీలకు సముచిత వాటా, భాగస్వామ్యం కల్పించాలి
సదస్సు వివరాలు:
తేదీ మరియు సమయం: డిసెంబర్ 11, 2025 (గురువారం), ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.
వేదిక: హోటల్ లెమన్ ట్రీ ప్రీమియర్, విజయవాడ
ఈ సదస్సుకు బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను, అన్ని బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులను, బీసీ మేధావులను, విద్యావంతులను, మీడియా మిత్రులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు బిసివై పార్టీ తెలిపింది. సదస్సు అనంతరం సాయంత్రం 5:00 గంటలకు సదస్సు తీర్మానాలను మీడియాకు వివరించడం జరుగుతుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఉన్నందున, సదస్సులో పాల్గొనదలచిన వారు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని బిసివై పార్టీ సూచించింది.
నమోదు కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
8886312345
9121258958
9440575120
8886268886
8121642233
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్లోని మాతృశ్రీనగర్లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......